Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారంటే?

కార్తీక మాసంలో దీపారాధన అనేది అత్యంత పవిత్రమైనది. దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మాసంలో సాధారణంగా 365 వత్తుల దీపం వెలిగిస్తారు. దీనివల్ల ఏడాది పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు.

author-image
By Kusuma
New Update
Vattula Deepam

Vattula Deepam

కార్తీక మాసంలో దీపారాధన అనేది అత్యంత పవిత్రమైనది. దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ మాసంలో సాధారణంగా 365 వత్తుల దీపం వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా వెలిగించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు? దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: రాగి.. ఇత్తడి పాత్రలు తళతళ మెరవాలా..? అయితే ఈ కిటుకు తెలుసుకోండి!!

ఒకే దీపంలో ఏడాది పుణ్యం

ఈ దీపారాధనలో ఉపయోగించే 365 వత్తులు సంవత్సరంలోని అన్ని రోజులను సూచిస్తుంది. పౌర్ణమి రోజున ఈ దీపం వెలిగించడం ద్వారా, భక్తులు సంవత్సరం పొడవునా ప్రతి రోజూ ఆలయానికి వెళ్లి దీపారాధన చేసినంత మహా పుణ్యాన్ని పొందుతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీనిని 'సంవత్సర దీపం' అని కూడా అంటారు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రతిరోజూ దీపం వెలిగించలేని వారికి ఇది బాగా అనుకూలమైనదని పండితులు అంటున్నారు. 

జ్ఞానానికి, లక్ష్మీ కటాక్షానికి గుర్తు

దీపం కేవలం కాంతిని ఇవ్వడమే కాదు, అది జ్ఞానానికి, శుభానికి కూడా ప్రతీక. ఈ 365 వత్తుల దీపం వెలిగించడం ద్వారా భక్తుల జీవితంలోని అజ్ఞానపు చీకట్లు, కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి దీపారాధన తప్పకుండా చేయాలి. ఈ పవిత్ర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

పాప నివారణ, మోక్ష ప్రాప్తి

కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ దీపాన్ని పరమేశ్వరుడికి లేదా విష్ణుమూర్తికి అంకితం చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ దీపాన్ని భక్తులు అత్యంత శ్రద్ధతో, భక్తితో ఆలయాలలో లేదా పవిత్ర నదీ తీరాలలో వెలిగిస్తారు. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం మంచిదని పండితులు అంటున్నారు.

దీపం వెలిగించే విధానం

ఈ దీపం వెలిగించడానికి 365 పత్తి వత్తులను జాగ్రత్తగా లెక్కించి, వాటిని ఒక పెద్ద వత్తిలాగా సమూహంగా తయారుచేస్తారు. ఈ వత్తిని పెద్ద మట్టి ప్రమిదలో లేదా 365 వత్తుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దీపపు కుందులో ఉంచి, తగినంత నూనె (ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె) పోసి, పౌర్ణమి తిథి సమయంలో వెలిగిస్తారు. దీపం వెలిగించేటప్పుడు శివకేశవుల నామాలను జపించడం, భక్తితో సంకల్పం చెప్పుకోవడం చేయాలి. ఈ విధంగా 365 వత్తుల దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: లవంగం నీటితో ఎన్ని లాభలో తెలిస్తే తాగకుండా ఉండలేరు మరి.. ఎలా తాగాలో.. ఎప్పుడు తాగాలో చదివి తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు