/rtv/media/media_files/2025/03/01/teawithwater8-477598.jpeg)
tea with water
నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాడీకి సరిపడా నీరు డైలీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ మనిషి రోజుకీ రెండు లేదా మూడు లీటర్ల నీరు తాగాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే రోజు మొత్తంతో పోలిస్తే.. ఉదయాన్నే పరగడుపున గ్లాసు నీరు తాగితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు
ఈ సమస్యల నుంచి విముక్తి..
చల్లని నీరు కంటే వేడి నీరు పరగడుపున తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం గ్లాసు వాటర్ పరగడుపున తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. ఈజీగా బరువు తగ్గుతారు. చల్లని నీరు కంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఈ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉదయం పూట గ్లాసు నీరు తాగడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉంటారు. శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి వేడి నీరు బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.
ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్లీ!