Big Breaking : టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!

తూర్పు గోదావరి జిల్లాఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌ హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

New Update
Big Breaking : టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!

TDP : తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) ఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (Pendyala Venkata Krishna Rao) (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌ (Hyderabad) హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతదేహన్ని బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం దొమ్మెరుకు తీసుకుని రానున్నట్లు బంధువులు తెలిపారు.

ఐదుసార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా కృష్ణబాబు విజయం సాధించారు. టీడీపీ (TDP) ఆవిర్భావం నుంచి 1983 లో , 1985, 1989, 1994, 2004 కేవలం ఆయన ఒక్కసారి తప్ప మిగిలిన ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కృష్ణబాబు పాలకొల్లులో జన్మించారు. ఎన్టీఆర్, చంద్రబాబులతో పెండ్యాల వెంకట కృష్ణారావుకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త విన్న తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

Also read: మైనర్‌ బాలుడి డ్రైవింగ్‌ ఇద్దరు మృతి…బెయిల్‌ ఇస్తూ కోర్టు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా!

Advertisment
తాజా కథనాలు