Bail Order : మద్యం తాగి అతి వేగంతో కారు (Drunk & Drive) నడిపి ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్న మైనర్ బాలుడికి కోర్టు బెయిల్ (Court Bail) ఇవ్వడమే కాకుండా ఓ విచిత్రమైన శిక్ష కూడా విధించింది. కేవలం 15 గంటల్లోనే బెయిల్ మంజూరు చేసి..శిక్షగా కేవలం 300 పదాల వ్యాసం రాయాలని , కొన్నాళ్లపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని తీర్పునిచ్చింది. ఈ వినూత్న తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్రకు (Maharashtra) చెందిన బ్రహ్మ రియాల్టీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ (17). మద్యం తాగి తన లగ్జరీ కారు పోర్షే కారులో పుణెలో బీభత్సం సృష్టించాడు. మద్యంమత్తులో కారును అతివేగంగా నడిపాడు. ఈ క్రమంలో పూణే – కళ్యాణి నగర్లో కారు అదుపు తప్పి వాహనదారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు పది మంది గాయపడ్డారు.. చికిత్స పొందుతూ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు.
Pune: తాగి ఇద్దరిని తొక్కి చంపితే వ్యాసం రాయమంటారా?.. ఇదెక్కడి న్యాయం అంటున్న నెటిజన్లు!
పూణేలో పీకల దాకా తాగి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఓ వ్యక్తికి మైనర్ అన్న కారణంతో 14 గంటల్లోనే బెయిల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి తండ్రి అత్యంత సంపన్నుడు కావడంతోనే ఇలా విడిచిపెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Translate this News: