CM Revanth Reddy Comments on KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, (BRS) కాంగ్రెస్ (Congress) నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా నీళ్లు, ప్రాజెక్టులపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు సభలో (Telangana Assembly) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ టార్గెట్ గ్ సంచలన కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్
అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు.
Translate this News: