”తెలంగాణ కోసం 24 ఏళ్ళ క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే ఇన్నాళ్ళు విజయం సాధించాను. కొడంగల్ రా.. గాంధీ భవన్ కు రా అని కొందరు సవాలు విసురుతున్నారు. కర్ణాటకలో 5 గంటలకు కరెంట్ కూడా కాంగ్రెస్ ఇవ్వడం లేదు. ఇప్పుడేమో ఇలాంటి సవాళ్ళు విసురుతున్నారు. తమకు దిక్కు లేకపోయినా మనకు నీతులు చెబుతున్నారు..” అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా దమ్మేంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ళ దగ్గర ఉన్నారో తెలియదా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
పూర్తిగా చదవండి..KCR: నా దమ్మేంటో దేశానికి తెలుసు.. రేవంత్ కు కేసీఆర్ కౌంటర్
తెలంగాణలో వాళ్ళకు దిక్కు లేదు కానీ మనకు నీతులు చెప్పేందుకు వస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసిందని... కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.
Translate this News: