Jupalli Krishnarao: ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు నేతలు ఇంకా అనుచరులతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun kharge) సమక్షంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం ఖర్గే నివాసంలో జరిగింది. అయితే వాస్తవానికి వీరంతా కాంగ్రెస్ లో బుధవారమే చేరాల్సి ఉండగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే షెడ్యూల్ బిజీగా ఉండడంతో కుదరలేదు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ ఠాక్రే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) , ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రావు, మల్లు రవి లు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు!
ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు..కాంగ్రెస్ లోకి చేరగానే జూపల్లి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు.. ఉద్యమం సమయంలో లక్షలు లేని వ్యక్తికి కోట్లు ఎలా వచ్చాయని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించిన జూపల్లి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని... అన్ని రంగాలను కేసీఆర్ నాశనం చేశారని ఫైర్..
Translate this News: