NEET-UG: పరీక్ష ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!
నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని NTAను ఆదేశించింది. వెబ్ సైట్లో అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది.