APPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షా విధానంలో కీలక మార్పులు!

గ్రూప్ 1 పరీక్షా విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఇకపై మెయిన్స్ ఎగ్జామ్స్‌కు వైట్ పేపర్‌తో కూడిన బుక్‌లెట్‌ను అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ప్రకటించారు.

New Update
APPSC Group-1: నేడే గ్రూప్-1 ఎగ్జామ్.. అరగంట ముందే ఎగ్జామ్ హాల్ లోకి.. పూర్తి వివరాలివే!

APPSC key changes Group 1 examination pattern

APPSC: గ్రూప్ 1 పరీక్షా విధానంలో ఏపీపీఎస్సీ కీలక మార్పులు చేసింది. ఇకపై మెయిన్స్ ఎగ్జామ్స్‌కు వైట్ పేపర్‌తో కూడిన బుక్‌లెట్‌ను మాత్రమే అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రూల్డ్‌ బుక్‌లెట్‌ స్థానంలో తెల్ల పేపర్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు ప్రకటించారు. ఈ మేరకు పరీక్షలు బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే రాయాలని తెలిపారు. స్కెచ్‌ పెన్నుతో రాస్తే మాల్‌ప్రాక్టీసు కింద గుర్తిస్తామన్నారు. మూల్యాంకనం చేయడం కుదరదని, కొత్త బుక్‌లెట్‌ను త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని స్పష్టం చేశారు. 

ఆప్షన్లు మార్చుకోవచ్చు..

ఇదిలా ఉంటే.. ఏపీలో గ్రూప్‌-1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వంటి వాటిలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఈ మార్పులు చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. అభ్యర్థులు ఈ తేదీలోగా వెంటనే మార్చుకోండి. 

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

ఇక గ్రూప్‌ 1 లో 2023 పోస్టుల భర్తీకి మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్ మే 03 నుంచి 09 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ మొత్తం 7 పేపర్లకు నిర్వహించనున్నారు.

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

 group-1 | mains | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు