JEE Main 2024: జేఈఈ పరీక్షకు ప్రతి ఏడాది దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరౌతుంటారు. 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్(JEE Main), జేఈఈ అడ్వాన్సుడ్(JEE Advanced).. ఈ రెండు పరీక్షలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. 2024 సంవత్సరానికి సంబంధించి NTA ఇప్పటివరకు క్యాలెండర్ విడుదల చేయలేదు. దీనిపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఈ పరీక్ష క్యాలెండర్ మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కానుందని సమాచారం. జేఈఈ మెయిన్ పరీక్ష ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
జేఈఈ పరీక్ష ఎందుకు?
జేఈఈ మెయిన్లో రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. JEE మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాల్లో 43 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ను పొందారు. తెలంగాణకు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్య అత్యధికంగా 100 పర్సంటైల్ స్కోర్ సాధించి టాప్ ప్లేస్లో నిలిచాడు. కాళ్లకూరి సాయినాధ్ శ్రీమంత్, ఇషాన్ ఖండేల్వాల్, దేశాంక్ ప్రతాప్ సింగ్, నిపున్ గోయెల్ కూడా 100 పర్సంటైల్ సాధించారు.
మిగిలిన పరీక్షల తేదీల సంగతేంటి?
JEE: విద్యార్థులకు అలెర్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్స్-2024 పరీక్షతో పాటు CUET 2024, NEET UG ఎగ్జామ్స్కి సంబంధించి తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలోనే విడుదల చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ప్రతిఏడాది దాదాపు 13లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు.
Translate this News: