CM Jagan: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

AP: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న భీమవరంలో పవన్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. పవన్‌ వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల సీఎం జగన్ కు ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

CM Jagan: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
New Update

Complaint On CM Jagan To EC: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న భీమవరంలో పవన్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. పవన్‌ వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల సీఎం జగన్ కు ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ALSO READ: జనసేనకు భారీ షాక్

ఇటీవల సీఎం జగన్ కు ఈసీ నోటీసులు..

ఏపీ సీఎం జగన్‌కు  భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో జగన్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు అలవాటు చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చసశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా జగన్ కు నోటీసులు జారీ చేశారు.

పవన్ పై సీఎం జగన్ పంచులు..

* బాబు సిట్‌ అంటే పవన్‌ సిట్‌.. స్టాండ్‌ అంటే పవన్‌ స్టాండ్‌

* ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి.

* చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు

* జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్‌ పిఠాపురం వదిలేసి హైదరాబాద్‌ పారిపోయే రకం

* బీఫామ్‌ బీజేపీ, కాంగ్రెస్‌, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్‌ మాత్రం చంద్రబాబుదే

#janasena #ap-elections-2024 #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe