అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదయాలను బతికించుకుంటున్నారని తెలిపారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కళ్లా కపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని చెప్పారు..

అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్
New Update

Pawan Kalyan Interesting Comments On Tribal People: నేడు ఆదివాసీ దినోత్సవం(World Tribal Day 2023) సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎమోషనల్ అయ్యారు. అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదయాలను బతికించుకుంటున్నారని తెలిపారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కళ్లా కపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని చెప్పారు.

అటవీ ప్రాంతంలో అనువైన పంటలు పండించుకుంటూ.. నిత్యం సవాళ్లతో స్నేహం చేస్తారని చెప్పారు. చెట్టు చేమలు, సకల జీవాలను దైవసమానంగా చూసుకొనే జీవవైవిధ్య పరిరక్షకులని వారిని కొనియాడారు. విద్య, వైద్యం, శుభ్రమైన తాగునీరు వీరికి ఇప్పటికీ గగన కుసుమాలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్. గిరిజనుల (Tribal People) బాగు కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ(ITDA) సంబంధిత విభాగాల్లో సేవాభావం కలిగిన వారిని నియమించి, ఆ వ్యవస్థను పటిష్టపరచాలని డిమాండ్ చేశారు పవన్. అత్యవసర ఆరోగ్య సమయాల్లో అడవి బిడ్డల కోసం ఎయిర్ అంబులెన్సులను సిద్ధం చేయాలని కోరారు.

మంచానికి కర్రలుకట్టి వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాసతో వారు ఆస్పత్రులకు వెళ్ళడం మనం మీడియాల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ చూస్తూనే ఉన్నామన్నారు. ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుందని.. ఈ పరిస్థితి మారాలని కోరారు. ఎంత వ్యయమైనా వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలని చెప్పారు పవన్. ఆరు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు.. ఒక ప్రాణాన్ని కాపాడడానికి హెలికాప్టర్‌ ను ఉపయోగించడం భారమైన పని కాదని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్‌ పై పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు.

అదే విధంగా గిరిజన బాలబాలికలకు విద్య అందుబాటులో ఉంచాలన్నారు. గిరిపుత్రులు వారు కోరుకున్న జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కనీస అవసరాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సూచించారు. గిరిజన లోకంలో చైతన్యం వెల్లివిరియాలని, వారు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్.

Also Read: ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు: పురంధేశ్వరి!

#pawan-kalyan-interesting-comments-on-tribal-people #janasena-chief-pawan-kalyan #tribal-people #interesting-comments #janasena-party #pawan-kalyan #janasena #janasena-pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe