IAS Smitha Sabrwal:ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్

సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్ళేందుకు స్మితా దరఖాస్తు పెట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఆమె పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

New Update
IAS Smitha Sabrwal:ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్

స్మితా సబర్వాల్...సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. చాలా పద్ధతిగల, స్ట్రిక్ట్ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఈమెను కార్యదర్శిగా నియమించారు. దీంతో పాటూ నీటి పారుదల శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటూ మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఇప్పుడు మళ్ళీ ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం ఆఫీసుకు స్మితా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఈమె కలవకపోవడం కూడా ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇరిగేషన్‌పై రివ్యూ మీటింగ్‌కూ స్మితా అటెండ్ కాలేదు. దీంతో స్మితా ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Also Read:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?

దీనికి తోడు ఈరోజు చేసిన స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఒకటి ఇంట్రస్టింగ్ గా మారింది. 23ఏళ్ల కిందటి ఫోటో షేర్ చేస్తూ..కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడైనా రెడీ అంటూ పోస్ట్ చేశారు. దీంతో స్మితా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్ళేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు