UN: దొంగచేతికే తాళాలు..ఉగ్రవాదాన్ని కట్టడి చేయమని పాక్ కే చెప్పిన ఐరాస

దొంగ చేతికే తాళాలు ఇచ్చాడంట ఓ యజమాని..ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చేసిన పని అలాగే ఉంది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయమని దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఐరాస చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

New Update
Pak

UN Security

ప్రపంచ శాంతికి కృషి చేయాలన్ని ఐక్యరాజ్యపమితే ఇప్పుడు మంటలను పెడుతోంది. ఉగ్రవాదానికి పట్టుకొమ్మలాంటి పాకిస్తాన్ కు అధికారాలు అప్పజెప్పింది. ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఉగ్రవాదులను కట్టడి చేయమని చెప్పింది. అంతేకాదు తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు పాకిస్తాన్ కే అప్పజెప్పింది ఐరాస. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒసామా బిన్‌ లాడెన్, హఫీజ్‌ సయీద్, మసూద్‌ అజార్, ముల్లా ఒమర్‌ లాంటి కరడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త పదవితో మరింత మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లో హాయిగా ఉంటారు. వారిని నిషేధిత జాబితా నుంచి పాకిస్తాన్ కమిటీ తప్పిస్తుంది. ఇది బారత్ కు ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు. దీని వలన భారత్ ను ఉగ్రవాదులు మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చని చెబుతున్నారు. గతంలో నలుగురు హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాకిస్థాన్‌ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు.. ఆ ప్రతిపాదన వెనక కుట్రను గమనించి తిరస్కరించాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటివి చేయదు అనడానికి ఎటువంటి సందేహం లేదు. 

ఛైర్మన్ పదవిపై కన్ను..

అయితే పాకిస్తాన్ చాలా పెద్ద ప్లానే వేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ ఛైర్మన్‌ పదవినే దక్కించుకోవాలని చూసింది. కానీ వైస్ ఛైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది కాక తాలిబన్ల పగ్గాలు దక్కడం కూడా ఆ దేశానికి కలిసొచ్చే అంశం. రీసెంట్ గా పహల్గాం దాడి తర్వాత ఆ దేశం భారత్ కు దగ్గర అయింది. ఇప్పుడు తమ చేతికి వచ్చిన అధికారాలతో పాకిస్తాన్ కాబూల్ కు దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా భారత్ కు అంతమంచిది కాదు. 

 

Also Read: Trump-musk: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు..ట్రంప్,మస్క్ మాటల యుద్ధం

Advertisment
Advertisment
తాజా కథనాలు