Pak-Afghan: పాక్ పై తాలిబాన్ల ప్రతీకారం..కునార్ నదిపై ప్రాజెక్టు

సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది. 

New Update
kunar

ఆఫ్ఘానిస్తాన్ మీద కాలు దువ్వి పాకిస్తాన్ తప్పు చేసింది. దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తోంది. ఇప్పటికే పహల్గాందాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాలను పరిమితం చేసింది. దీంతో పాక్ నీళ్ళు లేక విలవిలలాడుతోంది అంటే ఇప్పుడు ఆఫ్ఘాన్ కూడా పులి మీద పుట్రలా పాక్ పై మరో బాంబు పేల్చడానికి సిద్ధమైంది. ఇరు దేశాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కునార్ నది నీటిని మళ్లించే ప్రాజెక్ట్‌కు తాలిబన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  కునార్ నది నుంచి నంగర్ హార్ లోని దారుంతా డ్యామ్ కు నీటిని మళ్ళించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీనిపై తుది నిర్ణయం కోసం ఆఫ్గాన్ ప్రధాని కార్యాలయం ఆర్థిక కమిషన్‌కు పంపింది. 

కునార్ నదిపై ఆనకట్ట..ఎడారిగా ఖైబర్ పఖ్తుంఖ్వా..

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అఫ్గనిస్థాన్‌ నంగర్‌హార్‌ ప్రావిన్సుల్లో వ్యవసాయ భూములకు నీటి కొరత తీరుతుంది. ఇది ఆ దేశానికి చాలా మేలు చేస్తుంది. కానీ పాకిస్తాన్ కు మాత్రం సరదా తీరిపోతుంది. కునార్ నది నీరు రాకపోతే ఫాక్ లో ఖైబర్ పఖ్తుంఖ్వా ఏడిరిగా మారి పోతుంది. సుమారు 500 కిలోమీటర్లు ప్రవహించే కునార్ నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వతాల నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి అఫ్గన్‌లోకి ప్రవహించి, కునార్, నంగర్‌హార్ ప్రావిన్సుల గుండా ప్రవహించి కాబూల్ నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి పెచ్ నది నీటితో కలిసి తూర్పుగా తిరిగి పాక్‌లోకి ప్రవేశించి, పంజాబ్ ప్రావిన్సుల్లోని అట్టాక్ నగరం సమీపంలో సింధు నదికి చేరుతుంది. పాకిస్తాన్ లో ప్రవహించే పెద్ద నదుల్లో కునార్ నది ఒకటి. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన వనరుగా ఉంది. కునార్ నది పాక్‌లోకి తిరిగి ప్రవేశించే ముందు దానిపై ఆనకట్టలు నిర్మిస్తే...అక్కడి వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులకు నీటి లభ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఆఫ్ఘానిస్తాన్ ను డ్యమ్ నిర్మించకుండా ఆపడానికి పాకిస్తాన్కు అవకాశాలు కూడా లేవు. సింధుజలాల మాదిరిగా..ఈ నదిపై కాబూల్ తో పాక్ కు ఎటువంటి ఒప్పందాలు కూడా లేవు. 

ఆఫ్గాన్ కు మద్దతుగా భారత్..

రీసెంట్ గా కునార్ నదిపై డ్యామ్ నిర్మించాలంటూ తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. వీలైనత తొందరగా ఆనకట్ట  నిర్మించాలని ఆదేశించారు. విదేశీ కంపెనీల కోసం వేచి చూడకుండా, ప్రాజెక్టును ప్రారంభించడానికి దేశీయ కంపెనీలో ఒప్పందాలు చేసుకోవాలని మంత్రి  ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. ఈ నిర్యానికి భారత్ మద్దతు తెలిపింది.  డ్యామ్ నిర్మాణ విషయంలో ఆఫ్ఘానిస్తాన్‌కు భారత్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలకు భారతదేశం అండగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. డ్యామ్ ల నిర్మాణం విషయంలో ఇప్పటికే భారత్ ఆఫ్ఘనిస్తాన కు చాలాసర్లు సహాయం చేసింది. ఆ దేశంలో పలు డ్యామ్ లను నిర్మించింది. హెరాత్ ప్రావిన్సులో సల్మా ఆనకట్టను నిర్మించింది. 

Advertisment
తాజా కథనాలు