Asad: కీలక దశకు సిరియా అంతర్యుద్దం.. రష్యాకు పారిపోయిన అసద్‌!

సిరియా అంతర్యుద్ధం కీలక దశకు చేరింది.ఈ క్రమంలోనే దేశ అధ్యక్షుడు అసద్‌ దేశం విడిచి రష్యాకు పారిపోతుండగా, ఆయన విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో మరో ప్రచారం మొదలైంది.

New Update
siriya

Asad: సిరియా అంతర్యుద్ధం కీలక దశకు చేరింది. రాజధాని డమాస్కస్‌ నగర శివారులను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా రెబల్స్‌ దళాలు కూడా ధ్రువీకరించాయి. రాజధానిని తమ దళాలు చుట్టుముట్టి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్టు రెబల్స్ కమాండర్ హసన్ అబ్దేల్ ఘనీ ఓ కీలక ప్రకటనలో తెలిపారు. ఇక, 2018 తర్వాత సిరియా రాజధాని సమీపంలోకి రెబల్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. 

Also Read: రొమాన్స్ లో రెచ్చిపోయిన మెగా డాటర్.. హాట్ టాపిక్ గా నిహారిక వీడియో

పదమూడేళ్ల కిందట సిరియాలో అంతర్యుద్దం స్టార్ట్‌ అయ్యింది. అప్పటి నుంచి బసర్ అల్ అసద్ సారథ్యంలోని ప్రభుత్వం దళాలు, రెబల్స్ మధ్య యుద్ధం మొదలైంది.మరోవైపు, అధ్యక్షుడు అసద్‌ దేశం విడిచి రష్యాకు పారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. 

అయితే, ఈ వార్తలను ప్రభుత్వ దళాలు  తీవ్రంగా ఖండించాయి. తమ నేత డమాస్కస్ నుంచి రాజ్యాంగ, జాతీయపరమైన విధులు కొనసాగిస్తున్నారని సిరియా రక్షణ మంత్రి అబుల్ మహ్మద్ అల్ జొలానీ వివరించారు. రాజధాని డమాస్కస్‌లోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ దళాలు ఉన్నాయని, వెనక్కి తగ్గినట్టు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని వివరించారు.

Also Read: జాక్ పాట్ కొట్టిన యంగ్ హీరో.. కోలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో సందీప్ కిషన్

ఉత్తర సిరియాపై హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ నేతృత్వంలో ఉన్న తిరుగుబాటు దళాలు పట్టుబిగిస్తుండగా... దక్షిణ సిరియాలోనూ అసద్‌ పట్ల వ్యతిరేకత స్టార్ట్‌ అయ్యింది. కీలక నగరం దారాను కూడా రెబల్స్ ఆక్రమించారు. 2011లో అసద్‌కు వ్యతిరేకంగా ఈ నగరం నుంచి మొదలైన తిరుగుబాటే అంతర్యుద్ధానికి కారణం అయ్యింది. 

దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే, దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్‌ తెగ మిలిటెంట్లు రాజధాని డమాస్కస్‌ దిశగా సాగుతుంది.

Also Read: రెండు రోజుల వ్యవధిలోనే.. మరోసారి బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

అంతర్యుద్ధంలో అసద్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన రష్యా, ఇరాన్‌ల సాయం.. ప్రస్తుతం అంతంతమాత్రంగానే సాగుతుంది. పరిమిత స్థాయిలోనే రష్యా వైమానిక దాడులు నిర్వహించడంతో తిరుగుబాటుదారులపై అంతగా ప్రభావం చూపించడం లేదు. ఇరాన్‌ కూడా అదే దారిలో వెళ్తోంది. ఈ నేపథ్యంలో అసద్ తన పదవిని కాపాడుకోవడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Pushpa 2 : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే?

హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ అనేది సిరియాలో అల్‌ఖైదా విభాగం. దీనిని పశ్చిమ దేశాలు ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. ఇటీవలి సంవత్సరాలలో ఉగ్రవాద సంస్థ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. వీరు మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నందున.. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న మైనారిటీ సమూహాలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు. ‘అన్ని వర్గాలకు భరోసా కల్పించాలని మేం అనుకుంటున్నాం. మతవాదం, దౌర్జన్యాల యుగం శాశ్వతంగా పోయిందని అబ్దెల్ ఘనీ అన్నారు.

మరోవైపు, గత వారం నుంచి ఉద్ధృతమైన తిరుగుబాటులో 111 మంది పౌరుల సహా 826 మంది ప్రాణాలు విడిచారని, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

సిరియా అధ్యక్షుడి విమానం కూల్చివేత..!

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ -అసద్‌ విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. హయాత్‌ తహరీర్‌ అల్‌ - షామ్‌ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ పై పట్టు బిగించిన నేపథ్యంలో ఆసద్‌ కుటుంబంతో సహా నగరాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్‌-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌ సైట్ల సమాచారం చెబుతున్నట్లు ఈజిప్ట్‌ రచయిత ఖలీద్‌ మహమూద్‌ ఎక్స్‌ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రదేశం లెబనాన్‌ గగన తలం పరిధిలో ఉంది. ఎవరైనా దీనిని కూల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 

అయితే ఈ విషయాల పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు