/rtv/media/media_files/2025/05/10/yhOPOgXaV9ckQODUNzUo.jpg)
pak army
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్లాన్, పాకిస్లాన్ అక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరలపై భారత్ నిర్వహించిన వైమానిక దాడి తరువాత పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్ ప్రభుత్వం సరిహద్దుల్లో షెల్లింగ్, క్షిపణి దాడులతో ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తుండగా, దాని రిటైర్డ్ సైనిక అధికారులు భారత్ ముందు తమ సైనిక బలం బలహీనపడుతోందని అంగీకరిస్తున్నారు.
6 లక్షల మంది మాత్రమే
పాకిస్తాన్ డాన్ టీవీలో ప్రసారమైన వీడియో క్లిప్లో మాజీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ పాకిస్తాన్ సైన్యం పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "భారతదేశంలో 16 లక్షల మంది సైన్యం ఉంది, మన దగ్గర 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు" అని ఆయన అన్నారు. పాకిస్తాన్ నాయకత్వానికి భవిష్యత్తు, అంతర్జాతీయ ఒత్తిడి (ముఖ్యంగా అమెరికా) గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మసూద్ అక్తర్ అన్నారు.
Pakistan’s Retired Air Marshal Masood Akhtar gives a wake up call to bosses running fake agenda:
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 10, 2025
“Our condition is very bad , India has a force of 16 lakh, our strength is of mere 6 lakh. Neither can be match them in other fields. We can’t fight for long with India.” pic.twitter.com/g7ZEDdOpts
మే 7న భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్లో, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత సంస్థలకు చెందిన కనీసం 100 మంది ఉగ్రవాదులు మరణించారు. భారత చర్యను పౌరులపై దాడి అని పేర్కొంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేయడానికి ప్రయత్నించింది, కానీ జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ప్రకటన ఈ అబద్ధాన్ని బయటపెట్టింది. భారత్ జరిపిన క్షిపణి దాడిలో తన కుటుంబ సభ్యులు 10 మంది, నలుగురు ముఖ్య సహాయకులు మరణించారని మసూద్ అజార్ స్వయంగా అంగీకరించాడు.