Hamas-Israel: గాజాలో ఆగని మరణ మృదంగం.. 50 వేలు దాటిన మరణాలు

2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ ఆగడం లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.

New Update
Gaza

Gaza Photograph: (Gaza)

Hamas-Israel: ప్రస్తుతం గాజాలో మరణాలు ఆగడం లేదు. ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తోంది. ఈ 1.13 లక్షల మంది గాయపడినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 2023 అక్టోబరు 7న ప్రారంభమైంది.

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

హమాస్ సీనియర్ నేత..

ఇటీవల ఇజ్రాయెల్‌ నిర్వహించిన దాడిలో హమాస్‌ కీలక నేత సలాహ్‌ అల్‌ బర్దావీల్‌(66)తో పాటు అతని భార్య కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో బర్దావీల్‌ జన్మించాడు. అయితే ఇతను హమాస్‌ సీనియర్‌ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు కావడంతో పాటు హమాస్‌ రాజకీయ విభాగానికి కూడా నాయకుడు. అయితే ఇజ్రాయెల్‌ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి  హమాస్‌లో కీలకనేతగా బర్దావీలే వ్యవహరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు