Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి- శ్రీదేవి జంటగా నటించిన ఆల్ టైం క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' 25 ఏళ్ళ తర్వాత మరోసారి వెండి తెరపై సందడి చేస్తోంది. మే 9న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో చిరంజీవి, డైరెక్టర్ రాఘవేందర్రావు, ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ముగ్గురితో 'మ్యాజికల్ రీ యూనియన్' అంటూ చిట్ చాట్ షో నిర్వహించారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిరు, రాఘవేందర్రావు, అశ్వినీ దత్ 35 ఏళ్లనాటి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఆ ఉంగరం, చేప ఎక్కడ.?
అయితే ఈ షోలో మెగా హీరో రామ్ చరణ్ కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘35 ఏళ్లు అయింది. ఆ ఉంగరం, చేప ఏమయ్యాయి?.. అంటూ చిరును అడగడం నెట్టింట వైరలవుతోంది. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది .. ''మానవ నా అంగుళీయకం ఎక్కడ''? డైలాగ్. ఈ ఉంగరంతోనే సినిమా కథ మొదలవుతుంది. మానససరోవరంలో సేద తీరుతున్న ఇంద్రలోక కన్య దేవకన్య ఇంద్రజ అనుకోకుండా తన ఉంగారాన్ని పోగొట్టుకోవడం.. దానిని వెతుక్కుంటూ భూలోకానికి రావడం. ఈ క్రమంలో భూలోక మానవుడితో ప్రేమలో పడడం వంటి అంశాలతో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించారు.
A trip down memory lane… ✨
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 7, 2025
Director @imvangasandeep interacts with Team #JVAS, asking questions that take us through their unforgettable journey.
Experience the magic of #JagadekaVeeruduAthilokaSundari once again on the big screen this May 9th in 2D & 3D.@KChiruTweets… pic.twitter.com/FVoH6cb4CP
1990లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ సరికొత్త మెరుగులతో 2D, 3D ఫార్మాట్లో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Jagadeka Veerudu Athiloka Sundari re release | chiranjeevi | Ram Charan