‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !

35 ఏళ్ల తర్వాత 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మళ్ళీ రీరిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో చిరంజీవి, రాఘవేందర్రావు, అశ్వినీ దత్ రీయూనియన్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో చరణ్.. ‘35 ఏళ్లు అయింది. ఆ ఉంగరం, చేప ఏమయ్యాయి?.. అంటూ చిరును అడగడం నెట్టింట వైరలవుతోంది.

New Update

Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి- శ్రీదేవి జంటగా నటించిన ఆల్ టైం క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' 25 ఏళ్ళ తర్వాత మరోసారి వెండి తెరపై సందడి చేస్తోంది. మే 9న ఈ సినిమా గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో చిరంజీవి, డైరెక్టర్ రాఘవేందర్రావు, ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ముగ్గురితో 'మ్యాజికల్ రీ యూనియన్' అంటూ చిట్ చాట్ షో నిర్వహించారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిరు, రాఘవేందర్రావు, అశ్వినీ దత్ 35 ఏళ్లనాటి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' జ్ఞాపకాలను పంచుకున్నారు. 

ఆ ఉంగరం, చేప ఎక్కడ.?

అయితే ఈ షోలో మెగా హీరో రామ్ చరణ్ కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘35 ఏళ్లు అయింది. ఆ ఉంగరం, చేప ఏమయ్యాయి?.. అంటూ చిరును అడగడం నెట్టింట వైరలవుతోంది. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది .. ''మానవ నా అంగుళీయకం ఎక్కడ''? డైలాగ్. ఈ ఉంగరంతోనే సినిమా కథ మొదలవుతుంది. మానససరోవరంలో సేద తీరుతున్న ఇంద్రలోక కన్య దేవకన్య ఇంద్రజ అనుకోకుండా తన ఉంగారాన్ని పోగొట్టుకోవడం.. దానిని వెతుక్కుంటూ భూలోకానికి రావడం. ఈ క్రమంలో భూలోక మానవుడితో ప్రేమలో పడడం వంటి అంశాలతో ఈ  సినిమాను ఆసక్తికరంగా రూపొందించారు.  

1990లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ  సరికొత్త మెరుగులతో 2D, 3D ఫార్మాట్లో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Jagadeka Veerudu Athiloka Sundari re release | chiranjeevi | Ram Charan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు