/rtv/media/media_files/2025/05/08/DRMz848Jak6RWfXEkvOh.jpg)
pak media
ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ దళాలు రాఫెల్తో సహా భారత ఆర్మీకి చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చేశామని పాకిస్తాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని గురించి వివరించాలని, ఆధారాలు ఉన్నాయా అని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ను సిఎన్ఎన్ ప్రశ్నించింది. సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆసిఫ్ ఈ వింత ప్రకటన చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్
'భారత అధీనంలోని కశ్మీర్ లో ఫైటర్ జెట్ కూలినట్లు ఆ దేశ సోషల్ మీడియాలో వస్తోంది' అని బదులివ్వడంతో సదరు యాంకర్ అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిఫెన్స్ మినిస్టర్ హోదాలో ఉంటూ ఆసిఫ్ చేసిన సిల్లీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
For the love of God, please stop sending Pakistan's defense minister Khawaja Asif to engage with international media. At this point, he’s dangerous for Pakistan.https://t.co/7lLrtt3LnO
— Kevin Pollard (@football_roos) May 8, 2025
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్లోని తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.