US: బైడెన్ సంచలన నిర్ణయం..కొడుకుకి క్షమాభిక్ష

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు భారీ ఊరట లభించింది.అక్రమ ఆయుధ కొనుగోలుతో పాటు,మరో రెండు క్రిమినల్‌ కేసుల్లో నిందితునిగా ఉన్న తన కుమారుడు హంటర్‌ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

New Update
hunter

America: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు భారీ ఊరట లభించింది.మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్‌ ...తన కుమారుడికి కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు.అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్‌ కేసుల్లో హంటర్‌ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: UP:కాశీ ఆలయంలో కేక్ కట్‌ చేసిన మోడల్‌..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నభక్తులు

తన కుమారుడి పై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఈ సందర్భంగా జో బైడెన్‌ ఆరోపించారు. అమెరికా ప్రజలకు సత్యాన్నే చెప్పాలి..నా జీవితం మొత్తంలో నేను పాటిస్తున్న సూత్రం ఇదే..! న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజే  చెప్పా. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడిఉన్నా.

Also Read: AP: ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్‌ ఎమోషనల్ ట్వీట్‌

నా కుమారుడు హంటర్‌ ను అన్యాయంగా విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయా.రాజకీయ కుట్రలో భాగంగానే అతడి పై కేసులు పెట్టారు. ఇక జరిగింది  చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా. ఓ తండ్రిగా , అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా  ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు.

Also Read: Telangana: తెలంగాణపై ఫెంగల్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో వానలు!

కాగా..హంటర్‌ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్న బైడెన్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2018 లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని , తన వద్ద అక్రమంగా లేదని వెల్లడించారు.

Also Read: Mulugu: ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య!

అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్‌ డ్రగ్స్‌ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసయ్యారు. 11 రోజుల పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. ఇక కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్నుఎగవేత ఆరోపణలతో ఆయన పై కేసు నమోదైంది.

అక్రమ ఆయుధం కొనుగోలు వ్యవహారంలో హంటర్‌ పై నమోదైన కేసులో ఈ ఏడాది జూన్‌ లో న్యాయస్థానం ఆయన దోషిగా తేల్చింది. అయితే ఇప్పటి వరకు శిక్ష ఖరారు చేయలేదు. దీని పై అప్పట్లో జో బైడెన్ స్పందిస్తూ ..తీర్పును అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కేసులో తాను కుమారుడి తరుఫున క్షమాభిక్ష కోరబోనని అప్పట్లో వెల్లడించారు. ఇప్పుడు అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని బైడెన్‌ ఉపయోగించుకున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు