Bangladesh: దేశ ద్రోహం నేరారోపణతో బంగ్లాలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ఉ ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్ లోని కోర్టు తిరస్కరించింది.బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.
Also Read: AP Crime News: ఏపీలో దారుణం.. నడి రోడ్డు పై భర్తను చంపేసిన భార్య!
బంగ్లాలోని చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. చిన్మయ్ అరెస్ట్ అనంతర పరిణామాలను దృష్టిలోపెట్టుకుని గురువారం న్యాయస్థానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
Also Read: Sunita Williams: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్
బంగ్లాలో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబర్ లో చిట్టగాంగ్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబర్ 25న పోలీసులు ఆయనను అరెస్ట్చేశారు.
Also Read: Sabarimala: ఐదురెట్లు అధిక రద్దీ.. వారికి ప్రత్యేక పాస్లు రద్దు
అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరుఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా..అతడిపై ఆందోళనకారులు దాడిచేశారు. మరో సీనియర్ న్యాయవాది కేసును టేకప్ చేయగా..ఆయన పైనా బెదిరింపులకు పాల్పడ్డారు.
Also Read: Kakinada: ఏపీలో తెగబడ్డ గంజాయి బ్యాచ్.. ఏకంగా పోలీసులపైకే !
దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామి ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్, జోతే అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.