పాపం పండింది.. అభినందన్‌ను హింసించిన పాక్ సైనికుడికి కుక్క చావు!

తెహ్రీక్ -ఎ- తాలిబన్ పాకిస్తాన్ వజీరిస్తాన్‌లోని మంగళవారం సైన్యంపై దాడులు చేసింది. ఇందులో పాకిస్తాన్ సరిహద్దులో కెప్టెన్ అభినందన్‌ను బంధించి హింసించిన పాకిస్తాన్ మేజర్ మోయిజ్ అబ్బాస్ మరణించాడు. ఆయనతో తోపాటు మరో 14 మంది పాకిస్తాన్ సైనికులను మృతిచెందారు.

New Update
Pak Army officer

తెహ్రీక్ -ఎ- తాలిబన్ పాకిస్తాన్ దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధా, కుర్రంలలో మంగళవారం పాకిస్తాన్ సైన్యంపై పెద్ద దాడులు చేసింది. ఇందులో పాకిస్తాన్ సరిహద్దులో కెప్టెన్ అభినందన్‌ను బంధించి హింసించిన పాకిస్తాన్ మేజర్ మోయిజ్ అబ్బాస్ మరణించాడు. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ షాతోపాటు మరో 14 మంది పాకిస్తాన్ సైనికులను మృతిచెందారు. ఈ దాడిని పాకిస్తాన్ సైన్యం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ కొంతమంది సైనికులు ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారని తెలిపింది.

ఈ దాడిలో మరణించిన వారిలో పాకిస్తాన్ సైన్యంలోని సిక్స్ కమాండో బెటాలియన్‌లో పోస్ట్ చేయబడిన మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ షా పేరు కూడా ఉంది. తెహ్రీక్- ఇ -తాలిబాన్ దాడి చేసినప్పుడు మేజర్ సయ్యద్ సర్గోధా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్నాడు. 2019లో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైయిక్ చేసింది. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన గ్రూప్ కెప్టెన్ అభినందన్‌ను తానే పట్టుకున్నానని మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ ప్రకటించాడు. దీంతో మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ పేరు వార్తల్లోకి వచ్చింది. గ్రూప్ కెప్టెన్ అభినందన్ పాకిస్తానీ F-16ను కూల్చివేసాడు. ఆ సమయంలో అతని MIG-21 కూలిపోయింది. దీంతో అతను పాకిస్తాన్‌లో పడి ఆ దేశ సైన్యానికి పట్టుబడ్డాడు. అతని యూనిట్ అభినందన్ బంధించాయని మేజర్ సయ్యద్ పేర్కొన్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు