/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
సోషల్ మీడియా నిషేధంపై నేపాల్ యువత రోడ్లెక్కారు. ఆ నిరసన హింసకు దారితీసింది. సోమవారం కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు ఎంత చెప్పినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మందికిపైగా గాయపడ్డారు.
#UPDATE | Nepal Police says, "Nine people have lost their lives as Protest turned violent in Kathmandu as people staged a massive protest against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters" https://t.co/2gM8GGjJdx
— ANI (@ANI) September 8, 2025
నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. తమ దేశంలో రిజిస్టర్ చేసుకోని, స్థానిక నియమాలకు కట్టుబడి లేని సంస్థలపై ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నేపాల్ సుప్రీం కోర్టు కూడా సోషల్ మీడియా సంస్థలు దేశ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది యువతను ఆగ్రహానికి గురిచేసింది.
BREAKING : 8 Nepali youth killed in firing,many injured.Protest all over Nepal. Fire seen in one part of Nepali parliament. Communist Govt of Nepal summons an emergency meeting.
— Baba Banaras™ (@RealBababanaras) September 8, 2025
Millions of Nepali youths are on street after ban on all social media platforms except Chinese TikTok pic.twitter.com/Mp0rFctFgp
సోమవారం, రాజధాని ఖాట్మండుతో పాటు దేశంలోని పది ప్రధాన నగరాల్లో యువత భారీ ర్యాలీలు నిర్వహించారు. 'జెన్ Z విప్లవం' పేరుతో ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలతో వారి మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ఉపయోగించారు. ఈ కాల్పుల్లో 9 మంది చనిపోగా, పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ కేవలం సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేయడం మాత్రమే కాదు, దేశంలో పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగం, ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలుపుతున్నారు. "సోషల్ మీడియాను నిషేధించకండి, అవినీతిని నిషేధించండి" అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అదనపు సైనిక బలగాలను కూడా మోహరించారు. ఈ ఘటనతో నేపాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.