BIG BREAKING : పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం .. ముగ్గురు మృతి!

పాకిస్తాన్‌లోని కరాచీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కొందరి నిర్లక్ష్యం కారణంగా గన్ ఫైర్స్ కావడంతో ముగ్గురు చనిపోయారు. ఒక వృద్ధుడు, 8 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 60 మందికి పైగా తుపాకీ కాల్పులకు గురయ్యారు.

New Update
pakistan

పాకిస్తాన్‌లోని కరాచీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కొందరి నిర్లక్ష్యం కారణంగా గన్ ఫైర్స్ కావడంతో ముగ్గురు చనిపోయారు. ఒక వృద్ధుడు, 8 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 60 మందికి పైగా తుపాకీ కాల్పులకు గురయ్యారు. అజీజాబాద్‌లో యువతికి బుల్లెట్ తగలగా, కోరంగిలో స్టీఫెన్ అనే వ్యక్తి మరణించాడు. నగరవ్యాప్తంగా జరిగిన సంఘటనలలో కనీసం 64 మంది తుపాకీ గాయాలకు గురయ్యారు.

Also read :  War 2 Twitter Review: యాక్షన్ ప్రియులకు ఓకే కానీ..పాత సినిమాలో కొత్త క్యాస్టింగ్ అంతే..వార్ 2 ట్విట్టర్ రివ్యూ

20 మందికి పైగా అరెస్ట్

వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  వైమానిక కాల్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్ సహా పలు ప్రాంతాల నుండి వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.  గాయపడిన వారిని సివిల్ హాస్పిటల్, జిన్నా హాస్పిటల్, అబ్బాసి షహీద్ హాస్పిటల్, గులిస్తాన్-ఎ-జౌహర్ మరియు కరాచీలోని ఇతర ప్రాంతాలలోని ప్రైవేట్ సౌకర్యాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుండి 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.  

Also read :  Coolie Twitter Review: నాగార్జున విలన్ గా చించేశాడు..రజనీకి సూపర్ హిట్..కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

కాగా గత జనవరిలో కరాచీ అంతటా జరిగిన కాల్పుల సంఘటనలలో ఐదుగురు మహిళలు సహా కనీసం 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలలో ఐదుగురు మహిళలు సహా 233 మంది గాయపడ్డారు.

Also Read :  Girlfriend : ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు..  బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

పాకిస్థాన్ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ భవనాలను అందంగా అలంకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.  ఈ సందర్భంగా పాక్ ప్రధాని, రాష్ట్రపతి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం సాధించిన అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, సవాళ్లను గురించి ప్రస్తావించారు. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారిస్తున్నట్లు వారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తిని చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతులు నిర్వహించారు. 

Also read : UP crime : ఉత్తరప్రదేశ్‌లో దారుణం..  దివ్యాంగురాలిని వేటాడి, వెంటాడి మరీ అత్యాచారం!

Advertisment
తాజా కథనాలు