Girlfriend : ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు..  బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, పెంచిన పిల్లలను చంపేస్తున్న ఈ కాలంలో ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం దొంగగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది.

New Update
donga lover

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను, పెంచిన పిల్లలను చంపేస్తున్న ఈ కాలంలో ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం దొంగగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడికి బైక్ కొనాలనే ఉద్దేశ్యంతో పట్టపగలు దొంగతనం చేసి ప్రియురాలు పట్టుబడింది. ప్రియుడితో కలిసి తన బంధువుల ఇంట్లో నగదు, నగలు సహా సుమారు రూ.2 లక్షల విలువైన వస్తువులను దొంగిలించింది.  

నేరాన్ని దాచలేక నిజాన్ని

దొంగతనమైతే దైర్యంగా చేశారు కానీ పోలీసుల ముందు తడబడి నేరాన్ని దాచలేక నిజాన్ని ఒప్పుకున్నారు.  ఆరేళ్లుగా లవ్ లో వీరిద్దరని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం కన్హయ్య పటేల్ కూరగాయలు అమ్మడానికి మార్కెట్‌కు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగిలిపోయి ఉంది. రెండు పెట్టెల్లోంచి రూ.95 వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఆగస్టు 9వ తేదీన హల్బా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో గ్రామానికి చెందిన 22 ఏళ్ల కరుణ పటేల్, ఆమె 24 ఏళ్ల ప్రియుడు తమర్ధవాజ్ విశ్వకర్మ సంఘటన జరిగిన రోజున అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు.

బైక్ కొనడానికి డబ్బు అవసరమని

వారిని అదుపులోకి తీసుకుని విచారించగా  కరుణ తన ప్రియుడికి బైక్ కొనడానికి డబ్బు అవసరమని అందుకే ఇద్దరూ దొంగతనం ప్లాన్ చేశామని ఒప్పుకుంది. ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కరుణ తర బంధువు ఇంటి తాళం పగలగొట్టి అందులో నుంచి నగదు, నగలు దొంగిలించింది. ఆమె ప్రియుడు తామ్రధ్వజ్ విశ్వకర్మ  బయట ఎవరూ రాకుండా కాపలా కాస్తున్నాడు. దొంగిలించిన నగదును కరుణ  ప్రేమికుడికి ఇచ్చి, ఆ నగలను మాత్రం తన వద్దే ఉంచుకుంది.ఇద్దరూ నేరం అంగీకరించారని, దొంగిలించబడిన వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దినేష్ సిన్హా తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం 

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌లపై వెంటాడి, ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.  సీసీకెమెరాల సాక్షిగా ఈ దాష్టీకం  వెలుగులోకి వచ్చింది. యువతి రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె  కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.  పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పొలాల్లో ఆమె పడి ఉండటం గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల నివాసాలకు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.  

దీనిపై బాధిత కుటుంబ సభ్యులు బలరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నేపాల్ కు పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. నిందితులను అంకుర్ వర్మ(21), హర్షిత్ పాండే(22) గా గుర్తించారు. నిందితులను పట్టుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపారని పోలీసు సూపరింటెండెంట్‌ వికాస్‌ కుమార్‌ తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

Advertisment
తాజా కథనాలు