Paris Olympics: సెమీస్‌లో ఓడిన భారత్..ఇక కాంస్యం కోసం పోరు

ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. సెమీస్‌లో జర్మనీతో పోరాడిన టీమ్ ఇండియా చివరకు ఓడిపోయింది. 2–3 తేడాతో ఫైనల్స్‌కు అర్హత కోల్పోయింది.

New Update
Paris Olympics: సెమీస్‌లో ఓడిన భారత్..ఇక కాంస్యం కోసం పోరు

Indian Hockey Team: ఒలింపిక్స్‌లో మొదటి నుంచి టీమ్ ఇండియా హాకీ ప్లేయర్లు మంచి ప్రతిభ కనరుతూ వచ్చారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరుకున్నారు. ఇందులో గెలిస్తే పతకం రావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ రోజు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయింది టీమ్ ఇండియా. 2–3 తేడాతో ఓటమి పాలయ్యారు. కీలక పోరులో గెలిచేందుకు తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం రాలేదు. ఆశలన్నీ నిరాశలయ్యాయి. దీంతో ఇప్పుడు కాంస్యం కోసం పోరాటం కోసం భారత్ సిద్ధమయింది. ఇందులో స్పెయిన్‌తో టీమ్ ఇండియా తలపడనుంది.

Also Read:Sheikh Hasina:మరికొంత కాలం భారత్ లోనే షేక్ హసీనా

Advertisment
తాజా కథనాలు