Cricket: జింబాబ్వే పర్యటనలో సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్..తెలుగోడికి చోటు

టీ 20 వరల్డ్‌కప్‌ తర్వాత ఇండియా జింబాబ్వే టూర్ వెళ్ళనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. భారత జట్టు జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది.

New Update
Cricket: జింబాబ్వే పర్యటనలో సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్..తెలుగోడికి చోటు

zimbabwe Tour: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, సీనియర్ బౌలర్ బుమ్రాలకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. వరుసగా ఐపీఎల్, టీ20 ప్రపంచకప ఆడిని సీనియర్లు అలసి పోయారు. దీంతో వారికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ భావించింది. అందుకే వరల్డ్‌కప్‌ తర్వాత జరగనున్న జింబాబ్వే టూర్‌కు అందరూ కుర్రాళ్ళను సెలెక్ట్ చేసింది. జులై 6న ఐదు టీ 20 మొదలవుతుండగా.. జూలై 14న 5వ మ్యాచ్‌తో సీరీస్ ముగుస్తుంది. దీనికోసం ఆడే యువ ఆటగాళ్ళ జట్టుకు శుభ్‌మన్‌గిల్ కె్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ లిస్టులో ఐపీఎల్ లో సత్తా చాటిన తెలుగు ఆటగాడు అభిషేక్ శర్మతోపాటు, పరాగ్ లకు చోటును కల్పించారు.

జింబాబ్వేకు వెళ్ళనున్న జట్టు..
శుభమన్ గిల్ (C), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (W), ధృవ్ జురెల్ (W), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే

Also Read:Telugu MP’s: పంచెకట్టుతో పార్లమెంటుకు ఎంపీలు, తెలుగులో ప్రమాణం

Advertisment
తాజా కథనాలు