Talansani Srinavas yadav: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆఫీసులో ముఖ్యమైన ఫైల్స్ మాయం..

మసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యలయంలో ఫైల్స్ మాయమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSD కల్యాణ్‌ ఆఫీస్‌లో ఫైల్స్ కనిపించకుండా పోయాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ దుండగులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Talansani Srinavas yadav: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆఫీసులో ముఖ్యమైన ఫైల్స్ మాయం..

తెలంగాణలోని మసాబ్‌ట్యాంక్ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమవ్వడం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSD కల్యాణ్‌ ఆఫీస్‌లో ఫైల్స్ కనిపించకుండా పోయాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి మరీ దుండగులు ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ ఆధారాలు సేకరించారు. ఫైల్స్ మాయంపై డైరక్టర్‌ను శ్రీనివాస్ ప్రశ్నించగా.. ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ సమాధానమిచ్చారు. అయితే ఫైల్స్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిన్ననే ఫైల్స్ మాయమైనట్లు అధికారాలు గుర్తించారు. ఓఎస్డీ కల్యాణ్‌, ఆపరేటర్‌ మోహన్‌ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రుణమాఫీ అవుతుందా మాస్టారు?.. తెలంగాణలో గుసగుసలు

Advertisment
తాజా కథనాలు