ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇళ్లు నీట మునగడంతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద బాధితులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో పర్యటించి బాధితులకు కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు దేశం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ముంపునకు గురైన ప్రాంతాలను అధికార పార్టీ నేతలు ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు. వారు తినడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..వరద బాధితులను పట్టించుకోరా..
ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరదల వళ్ల ఇళ్లు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వరద ప్రభావిత ప్రాంత వాసులను పరామర్శించి వారికి కూరగాయలు,, గడ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు
Translate this News: