Weight Loss: మీ బరువు పదిరోజుల్లో తగ్గాలంటే ఈ విషయాలను వదులుకోండి చాలు

ఆహారంలో పిండి, చక్కెర, పాల వంటి వస్తువులను పూర్తిగా పక్కన పెడితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో జొన్నలు, మిల్లెట్, రాగులు, మొక్కజొన్నలు, మల్టీగ్రెయిన్ రోటీలను తింటే ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండింటినీ మెరుగుపరుస్తుంది.

New Update
Weight Loss: మీ బరువు పదిరోజుల్లో తగ్గాలంటే ఈ విషయాలను వదులుకోండి చాలు

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు పెరగడం అనేది సాధారణ సమస్యగా మారింది. దీనివల్ల అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిమ్‌కి వెళ్లి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు.కొన్ని విషయాలు పాటిస్తే బరువు తగ్గడానికి సులభమైన, ఆరోగ్యకరమైన మార్గం ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడం నేడు సవాలుగా మారింది. కొందరూ ఊబకాయం, బరువు తగ్గడం కోసంలు జిమ్‌లలో చేరి అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరూ డైట్ ఫాలో అవుతారు. అయితే..దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ కొన్ని ఆహారాలను నిపుణులు సూచిస్తున్నారు. దీనిని పాటిస్తే కేవలం 10 రోజుల్లో బరువును సులభంగా తగ్గించవచ్చు. బరువు తగ్గాలనుకుంటే.. నిపుణులు చెప్పే బరువు తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే దూరం చేయాల్సిన పదార్ధాలు:

  • ఆహారంలో పిండి, చక్కెర, పాల వంటి వస్తువులను పూర్తిగా పక్కన పెట్టాలి. ఆహారంలో జొన్నలు, మిల్లెట్, రాగులు, మొక్కజొన్నలు, మల్టీగ్రెయిన్ రోటీలను తింటే మంచిది. ఇది ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండింటినీ మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • ప్రతీరోజూ ఉదయం కనీసం రెండు గ్లాసుల నీరు త్రాగాలి. వీలైతే.. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయ వేసి బాగా కలపాలి. ఇలా చేయడం ద్వారా.. జీవక్రియ వేగంగా పెరుగుతుంది. బరువు కూడా సమానంగా వేగంగా తగ్గుతుంది.
  • డైట్ నిజాయితీగా, సరిగ్గా పాటిస్తే 10 రోజుల్లోనే బరువులో కనిపించే తేడా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి అజాగ్రత్తకు దూరంగా ఉండాలి. 5 విషయాలను దృష్టిలో ఉంచుకుంటే..అది బరువు తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
  • ప్రతీరోజూ కనీసం గంటసేపు శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలి. పరిగెత్తడం, నడవడం, నృత్యం చేయడం వలన శరీర కదలికను మెరుగుపరుడుతాయి. ఇది జీవక్రియను గొప్ప మార్గంలో పెంచుతుంది, కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది.
  • అన్నింటిలో మొదటిది.. బయటి ఆహారం అంటే జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా పెట్టాలి. ఎలాంటి వేయించిన ఆహారాన్ని పూర్తిగా తీసుకోకుండాదు.. ఉడకబెట్టిన పప్పు మాత్రమే తింటే ప్రయోజనాలను త్వరలో చూస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పాలల్లో జాజికాయ కలిపి తాగితే ఆరోగ్యం పదిలం..అనారోగ్యం దూరం!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు