Hyper Aadi: పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తాడంటే...

సినీ తారల ఎంట్రీతో పిఠాపురం పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుఫున జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కచ్చితంగా పవన్ లక్షకుపైగా మెజార్టీతో గెలుస్తారన్నారు.

New Update
Hyper Aadi: పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తాడంటే...

Hyper Aadi Campaigning For Pawan Kalyan:  కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజవర్గంలో సినీ తారలతో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో (Pithapuram) ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడంతో ఆయన తరుఫున సెలబ్రెటిలు ప్రచార రంగంలోకి దిగారు. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జనసేన తరఫున ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు.

Also Read: వేసవి వద్దు.. సంక్రాంతి ముద్దు అంటున్న స్టార్స్.. అందరూ అప్పుడే.. 

ముందుగా ఎండపల్లి జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం అక్కడ నుండి పవన్ కళ్యాణ్ తరఫున కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో ఎన్నికలు ప్రచారం ప్రారంభించారు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఆదికి అడుగడుగునా మహిళలు హారతులు ఇస్తూ ఘనంగా స్వాగతించారు.


Also Read: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్!

ఈ సందర్భంగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆది కోరారు. హైపర్ ఆది RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తాడంటున్నారు. కుటమితో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. నియోజకవర్గంలో సినీస్టార్ల సందడితో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి అధిక మెజార్టీతో గెలుపు తధ్యం అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు