HYDRA: మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా షాక్!

TG: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన దుండిగల్‌లోని MLRIT, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

New Update
HYDRA: మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా షాక్!

Marri Rajashekar Reddy: అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. దుండిగల్‌లోని MLRIT, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పెర్కొంది. కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పేర్కొంది.

లేని పక్షంలో కూల్చివేతలు తప్పవంటూ హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీలను చిన్న దామెర చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. చెరువులో నిర్మించిన మర్రి కాలేజీలను హైడ్రా అధికారులు పరిశీలించారు. గతంలోనే చెరువు FTLలో నిర్మించిన కొన్ని బిల్డింగులు మున్సిపల్ అధికారులు కూల్చేశారు. కాగా ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై హైడ్రా చేస్తున్న యుద్ధంతో మల్లారెడ్డి ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Advertisment
తాజా కథనాలు