Hyderabad terror case:హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో తీర్పు

హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో ఈరోజు తీర్పు వెలువడింది. మొత్తం పదకొండుమందికి పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది.

Hyderabad terror case:హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో తీర్పు
New Update

హైదరాబాద్ పేలుళ్ళ కేసులో ఎట్టకేలకు తీర్పు వచ్చింది.  ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసులో నిందితులకు శిక్ష వేస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్ తో పాటూ 10మందికి జైలు శిక్ష ఖరారు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. హైదరాబాద్ లో పేలుళ్ళకు ఒబెద్ ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్ధాలు తీసుకొచ్చి మరీ పేలుళ్ళకు కుట్ర పన్నారు. అయితే తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది.

Also Read:నా దమ్మేంటో దేశానికి తెలుసు.. రేవంత్ కు కేసీఆర్ కౌంటర్

మరోవైపు ముజాహిద్దీన్ కుట్రగా పేరు పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్ ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ముక్బల్ ఇందులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు. ముకబ్ల్ నాందేడ్ కు చెందినవాడు. ఇతనిని ఫిబ్రవరీ 28న అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థ ముజాహిద్దీన్ లో కీలక సభ్యులతో ముక్బుల్ కు దగ్గరి సంబంధాలున్నాయి.

Also Read:దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం..

#delhi #nia #hyderabad #court #terror-conspiracy-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి