Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం..అనుమానంతో భార్యకు గుండు కొట్టించిన భర్త

మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వస్తే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం చేసి..చిత్ర హింసలు పెట్టిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది.

New Update
Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం..అనుమానంతో భార్యకు గుండు కొట్టించిన భర్త

East Godavari :భర్త అయితే చాలు తమకు అన్ని అధికారాలు ఉన్నాయనుకుంటారు. మగాడు అన్న అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా భార్యల విషయంలో భర్తలు చేసే ఆగడాలకు హద్దూ-పద్దూ లేకుండా పోయింది. తూర్పు గోదావరి జిల్లాలో ఓ భర్త చేసిన నిర్వాకం కలకలం సృష్టించింది. ఇది అక్కడ వైరల్‌గా మారింది.

Also Read:Jobs:ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే?

అనుమానం పెనుభూతమై..

సీతానగరం (మం) పెదకొండేపూడి లో రాంబాబు అనే వ్యక్తి తన భార్యను అనుమానించడమే కాక...ఆ మిషతో ఆమెకు బలవంతంగా గుండు చేయించాడు. దాంతో పాటూ చిత్రహింసలకు గురి చేశాడు. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనకు గతంలో పెళ్ళి అయిందని చెప్పినా రాంబాబు వెంటపడి మరీ పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు ఆశ చెబుతోంది. పెళ్ళయిన తర్వాత మాత్రం తనను నరకయాతనకు గురిచేస్తున్నాడని వాపోయింది. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసే సమయంలో పరిచయం అయిన అభిరామ్..షూటింగ్ నేపథ్యంలో పెదకొండేపూడి వచ్చాడు.తనని ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని ఆశ చెప్పింది. తనకు బలవంతంగా గుండు చేయించడంతో ఏడుస్తూ వీడియో పెట్టింది. ఇందులో తన బాధంతా చెప్పుకుంది. అతనికి మరోక అమ్మాయితో పరిచయం ఉందని...అందుకే తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో రాంబాబు మీద పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.

కదిలిన అధికార యంత్రాంగం...
వివాహితపై భర్త శిరోముండనం అమానుష ఘటన వీడియో వైరల్ అవడంతో అక్కడి అధికార యంత్రాంగం వెంటనే రియాక్ట్ అయింది. జిల్లా కలెక్టర్ మాధవి లత ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. భర్త అభిరామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసి బాధితురాలు ఆశను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..భార్యపై ఇటువంటి అమానస ఘటనకు పాల్పడడం చాలా బాధాకరం అని అన్నారు.
బాధితురాలకు అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని ఆయన మామీ ఇచ్చారు. ప్రస్తుతం భర్త రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు