Telangana: కట్టుకున్నదాన్ని చంపేసి..అనారోగ్యం అని నాటకం

భార్యను హత్య చేసేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకూడదని అంబులెన్స్‌ ను పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ డాక్టర్లు ఆమె మెడ మీదున్న గాయలను చూసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో సదరు భర్త బండారం బయటపడింది.

Telangana: కట్టుకున్నదాన్ని చంపేసి..అనారోగ్యం అని నాటకం
New Update

Suryapet: తెలంగాణ జిల్లా సూర్యాపేటలో జరిగిందీ సంఘటన. సూర్యాపేటలో చిలుకూరు మండలానికి చెందిన దాసోజు బ్రహ్మచారి 2014లో నకిరేకల్‌ మండలం కడపర్తి గ్రామానికి చెందిన సరితను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ బ్రహ్మచారికి మద్యం అలవాటు ఉంది. ఈ కారణంగా భార్యభర్తలు గొడవలు పడుతూ ఉండేవారు. బుధవారం ఉదయం బ్రహ్మచారి భార్య నిద్ర లేవడం లేదని బంధువులకు చెప్పాడు. తరువాత అంబులెన్స్‌ ను పిలిచి ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళాడు. అయితే సరి అప్పటికే మృతి చెందింది.

సరిత మృతిని నిర్ధారించాక డాక్టర్లకు అనుమానం వచ్చి పరిశీలించగా ఆమె మెడ మీద గాట్లు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సరిత మెడపై ఉన్న గాట్లను బట్టి పోలీసులు హత్య జరిగినట్లు గుర్తించారు. బ్రహ్మచారిని ప్రశ్నించగా... ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న జీఐ వైరుతో భార్య మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీఉలు బ్రహ్మచారి మీద కసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హత్య కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Also Read: Telangana: పెళ్ళి చేయలేనన్న భయంతో కూతురిని చంపేసిన తండ్రి

#husband #telangana #wife #suryapet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe