Over Speed Bus Accident : వరంగల్ జిల్లా (Warangal District) లో ఘోర ప్రమాదం జరిగింది. ఏకశిలా స్కూలు బస్సును (Bus Accident) వేగంగా కారు ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు (Students) ఉన్నారు. చిన్నారుల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హన్మకొండ – కమలాపూర్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. యూ టర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సు (School Bus) ను మారుతి షిఫ్ట్ డిజైర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. బస్సు పల్టీ కొట్టిన వెంటనే సిబ్బంది అప్రమత్తమైంది. కిటికీ అద్దాల్లోంచి బయటకు వచ్చి ఎమర్జెన్సీ విండో బద్దలు కొట్టి పిల్లల్ని కాపాడారు. స్కూలు సిబ్బందికి స్థానికులు సహకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తోంది.
Bus Accident : అతివేగంతో కారు ఢీ.. పల్టీ కొట్టిన స్కూల్ బస్సు!
TG: హన్మకొండ-కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు చిన్నారులు గాయాలు అయ్యాయి.
Translate this News: