జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో ఉగ్రవాదులను అంతమొందించేందుకు సైన్యం, పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. బుధవారం ఇక్కడ కల్నల్, మేజర్, డీఎస్పీ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్లోని దట్టమైన అడవుల్లో లష్కరే తోయిబాకు చెందిన పలువురు ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న పక్కా సమచారం భద్రతా బలగాల వద్ద ఉంది. మంగళవారం నుంచి వీరితో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. గురువారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదులు చుట్టుముట్టారని, శుక్రవారం నాటికి వారిని అంతం చేస్తామని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Jammu-Kashmir Encounter: జమ్మూలో భారీ ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లకు గాయాలు..!!
అనంతనాగ్లోని గాడోల్ అడవుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న పక్కా సమాచారంతో భద్రతబలగాలు చుట్టుముట్టాయి. వీరిని అంతమొందించేందుకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని వారిని అంతమొందిస్తామని డీజీపీ తెలిపారు.
Translate this News: