డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక ప్రకటన చేశారు. రూ.5 వేల కోట్లతో 30 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఒక్కో కాంప్లెక్సులో 4 చొప్పన 120 గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటి నిర్మాణం కోసం సంక్షేమశాఖల అధికారులు.. ఆయా నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి భూములు సమీకరించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం బీసీ సంక్షేమశాఖ నుంచి 800 మంది, మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి 500 మంది విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Telangana: 120 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తాం.. భట్టీ కీలక ప్రకటన
రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో 30 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో కాంప్లెక్సులో 4 చొప్పన 120 గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
Translate this News: