Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల

చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

New Update
Job Notification : నిరుద్యోగులకో శుభవార్త..కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల

Ap :చాలాకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ వెలువరించింది. రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్‎లో భాగంగా జూనియర్ డివిజన్ బెంచ్‌ కు సంబంధించిన 39 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఆన్ లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.

వీటిలో 32 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేయనుండగా మిగిలిన 7 పోస్టులను ట్రాన్స్ ఫర్ పద్ధతిలో నియమించనున్నారు. దీనికి గాను లా విద్యలో డిగ్రీ పట్టా పొంది వయసు 35 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ క్యాటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. అలాగే దివ్యాంగులకు వయోపరిమితిలో పదేళ్ల మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ పూర్తిగా ఆన్ లైన్ లో మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది.

జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తుకు రూ.1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుకు గడువు 2024 జనవరి 31 నుంచి 2024 మార్చి 1 వరకూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా, వాయిస్ టెస్ట్ ఇలా వివిధ దశల్లో నిర్వహిస్తారు. వీటన్నింటిలో మంచి ప్రతిభ కనబరిచిన వారితో తుది జాబితాను విడుదల చేసి నియమకాలు చేపడుతారు.

Advertisment
తాజా కథనాలు