హైదరాబాద్లోని వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనంపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులపై దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. గత కొన్నేళ్ళుగా హుస్సేన్ సాగర్లో డ్రైనేజ్ మురికి నీరు కలుస్తుందన్నారు. దానివల్ల హుస్సేన్ సాగర్ పొల్ల్యూట్ కావడం లేదా..? అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత గణేష్ ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయని అన్నారు. కొంతమంది కావాలని గణేష్ నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుందని కోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు. కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాది సరైన రీతిలో వాదించలేకపోవడం వల్లే హైకోర్టు పీవోపీ వినాయకులను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని తీర్పు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Ganesh Nimajjanam 2023: అక్కడే గణేశ్ నిమజ్జనం చేసి తీరుతాం.. ప్రభుత్వానికి రాజాసింగ్ సంచలన వార్నింగ్
దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలుపెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులు గణపతి మండపాల్లో పూజలను అందుకున్న బుజ్జి గణపయ్య గంగమ్మతల్లి ఒడిలో చేరే సమయం దగ్గర పడింది.
Translate this News: