/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-79.jpg)
Gadwal: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలనుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హస్తం గూటికి చేరనున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో మంత్రి జూపల్లిని కలిసిన కృష్ణ మోహన్.. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కృష్ణమోహన్రెడ్డి 2009లో టీడీపీ నుంచి గద్వాల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018, 2023లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతుండటం చర్చనీయాంశమైంది.