Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
New Update

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు.

#telugu-news #road-accident #ap-news #accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి