KCR: అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ చలో నల్గొండ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడం.. మాట్లాడం ఇదే తొలిసారి. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు కృష్ణా జలాలవాటా పై జరుగుతున్న విషయం తెలిసిందే. KRMB కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు… లేదు బీఆర్ఎస్ హయాంలోనే KRMBని కేంద్రానికి అప్పగిస్తూ ఆనాటి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ వివాదానికి చెక్ పెట్టాలంటే అది కేసీఆర్ వల్లే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై కేసీఆర్ ఒక్కరే క్లారిటీ ఇవ్వగలరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..KCR: టార్గెట్ రేవంత్.. మరికాసేపట్లో కేసీఆర్ బహిరంగ సభ
అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ చలో నల్గొండ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడం ఇదే మొదటి సారి.
Translate this News: