Telangana CM Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్ (Hyderabad)చేరుకున్న తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు. పుష్పగుచ్చం స్వాగతం పలికారు. అయితే, ఎయిర్పోర్టు నుంచే ఆయనకు కాన్వాయ్ ఏర్పాటు చేయగా.. అధికారిక వాహనంలో ప్రయాణించేందుకు నిరాకరించారు రేవంత్ రెడ్డి. తాను ఇంకా ముఖ్యమంత్రి కాలేదని, ప్రమాణ స్వీకారం చేయలేదన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చూసుకుందాం అంటూ అధికారులకు చెప్పారు రేవంత్ రెడ్డి. అనంతరం తనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో బెగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. భద్రతా కారణాల రిత్యా రేవంత్ వాహనాన్ని ప్రభుత్వ కాన్వాయ్ అనుసరించింది. ఇది తమ బాధ్యత అని రాష్ట్ర డీజీపీ తెలిపారు. కాగా, బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్కు వెళ్లారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చర్చలు జరిపారు.
పూర్తిగా చదవండి..Telangana: ఇప్పుడు కాదు.. ఆ తరువాతే.. కాన్వాయ్కు నో చెప్పిన రేవంత్..
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ కాన్వాయ్ ఎక్కేందుకు నిరాకరించారు. బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయనకు అధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేయగా వద్దని చెప్పారు. తానింకా ప్రమాణ స్వీకారం చేయలేదని పేర్కొన్నారు.
Translate this News: