Alert : ఫోన్ పే, జీ పే వాడే వారికి అలెర్ట్.. ఎన్నికల అధికారుల నిఘా..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అప్రమత్తమయ్యింది. డిజిటల్ చెల్లింపులపై ఈసీ స్పెషల్ నజర్ పెట్టింది. రాజకీయ పార్టీల బ్యాంకుల ఖాతాపై ప్రత్యేక దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోల్చితే ఈ సారి డిజిటల్ చెల్లింపులు రెట్టింపు అయ్యాయి. చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే, ఫోన్ పై తోపాటు ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లిస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమయ్యింది. దీనిలో భాగంగానే పర్సనల్ అకౌంట్స్ తోపాటు రాజకీయ పార్టీల అకౌంట్స్ ఈసీ నజర్ పెట్టింది.

New Update
UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హోరు షురూ అయ్యింది. నాయకులు, రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. చిన్న మొత్తంలో సొమ్మును ఓటర్లకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లిస్తున్నారు. దీంతో డిజిటిల్ పేమెంట్స్ పై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బు పంపుతున్న అంశంపై సీరియస్ యాక్షన్ కు సిద్ధమైంది ఈసీ. దీనిలో భాగంగానే పర్సనల్ అకౌంట్స్ తోపాటు అన్ని రాజకీయ పార్టీ అకౌంట్స్ పైఎన్నికల సంఘం నజర్ పెట్టింది.

ఇది కూడా చదవండి: రంగంలోకి ప్రధాని మోదీ.. బీజేపీ భారీ స్కెచ్‌!

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాంగం ...ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్దెత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయి. అంతేకాదు ఆన్ లైన్ ద్వారా సాగే అడ్డగోలు నగద లావాదేవీలను కట్టడిపెట్టేందుకు ఈసీ రెడీ అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోల్చితే ఈ సారి డిజిటల్ చెల్లింపులు రెట్టింపు అయ్యాయి. చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే, ఫోన్ పే ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లిస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ పై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. దీంతో డిజిటిల్ పేమెంట్స్ పై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బు పంపుతున్న అంశంపై సీరియస్ యాక్షన్ కు సిద్ధమైంది ఈసీ. దీనిలో భాగంగానే పర్సనల్ అకౌంట్స్ తోపాటు అన్ని రాజకీయ పార్టీ అకౌంట్స్ పైఎన్నికల సంఘం నజర్ పెట్టింది.

ఇది కూడా చదవండి: పసికూనలపై ప్రతాపం.. ఒక్క మ్యాచ్‌ గెలుపుతో సెమీస్‌ రేస్‌లోకి ఆసీస్!

బ్యాంకు అధికారులతో ఈసీ వరుసగా సమావేశం అవుతోంది. రోజువారీ అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు చెలామణి అవుతున్న అకౌంట్స్ లిస్టును ఇవ్వాలని బ్యాంకులను ఈసీ కోరింది. ఒకే అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదు ట్రాన్స్ ఫర్ అయ్యే అకౌంట్స్ పై ఓ కన్నేసింది. గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేసే ఛాన్స్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు