భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు

ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

author-image
By srinivas
New Update
భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు

జమ్మూ కశ్మీర్‌లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇంట్లోనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైనట్లు తెలిపిన అధికారులు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

Also read :అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే

ఇదిలావుంటే.. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలోనూ గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించినట్లు చెప్పారు. దీని తీవ్రత 3.1గా నమోదయిందని, భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం రాజధాని డెహ్రూడూన్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయకు వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు