కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్ధిపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పు తీరిపోయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత అప్పు తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ విధంగా అప్పు తీర్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..కాళేశ్వరం లెక్కలు తేలాల్సిందే.. శ్వేతపత్రం విడుదల చేయండి: బీజేపీ ఎమ్మెల్యే
Translate this News: