వరద ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ, కాంగ్రాస్ ప్రచార కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ముంపునకు గురైన బొక్కల గడ్డ (Bokkala gadda) ప్రాంతంలో పర్యటించిన ఆయన.. ఇంటింటికీ తిరుగుతూ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు (Munneru) వాగు సైతం ఏ సంవత్సరం లేని విధంగా ఉధృతంగా ఉందని వరద మరోసారి పెరిగినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. ముంపు ప్రాంత వాసులు బయట తిరుగొద్దని, పదునుగా ఉన్న విద్యుత్ స్థంభాలను ముట్టుకోవద్దని, వరద ఉధృతి ఉన్న ప్రాంతాలవైపు వెళ్లొద్దని సూచించారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు.
Translate this News: