• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » కేసీఆర్‌.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి

కేసీఆర్‌.! ఆ విషయం మర్చిపోయారా..? ప్రశ్నించిన పొంగులేటి

Published on July 29, 2023 6:05 pm by Veera Swamy

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు పలు సూచనలు చేసిన ఎంపీ.. సీఎం కేసీఆర్‌ అజాగ్రత్త వల్లే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయన్నారు. గతంలో వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఏమైందని మాజీ ఎంపీ ప్రశ్నించారు.

Translate this News:

వరద ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ, కాంగ్రాస్‌ ప్రచార కమిటి కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ముంపునకు గురైన బొక్కల గడ్డ (Bokkala gadda) ప్రాంతంలో పర్యటించిన ఆయన.. ఇంటింటికీ తిరుగుతూ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు (Munneru) వాగు సైతం ఏ సంవత్సరం లేని విధంగా ఉధృతంగా ఉందని వరద మరోసారి పెరిగినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. ముంపు ప్రాంత వాసులు బయట తిరుగొద్దని, పదునుగా ఉన్న విద్యుత్‌ స్థంభాలను ముట్టుకోవద్దని, వరద ఉధృతి ఉన్న ప్రాంతాలవైపు వెళ్లొద్దని సూచించారు.

https://rtvlive.com/wp-content/uploads/2023/07/p1.mp4

గత సంవత్సరం భద్రాచలంలో భారీగా వరదలు వచ్చాయని, ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ (kcr) పర్యటించి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ మాట ఇచ్చి సంవత్సరం దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆరోపించారు. కేసీఆర్‌ (kcr) ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే ఉండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం మున్నేరు ప్రాంతంలో పర్యటించిన ఓ వ్యక్తి కరకట్ట ఎలా నిర్మిస్తారు మట్టిగడ్డలతోనా అని వెటకారం చేశారని పొంగులేటి గుర్తు చేశారు.

https://rtvlive.com/wp-content/uploads/2023/07/p-2.mp4

ఆ నాయకుడు ఏనాడైనా నిర్మాణాలు చేపడితే కరకట్ట గురించి తెలిసేదని మాజీ ఎంపీ ఎద్దేవా చేశారు. చిన్నవర్షం కురిసినా మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోందన్నారు. ఇంత వరకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ (Puvvada Ajay) వరద బాధితులను పరామర్శించి పాపాన పోలేదన్నారు. ఎన్టీఆర్‌ (ntr) విగ్రహం ఏర్పాటు చేయడంలో ఉన్నశ్రద్ధ వరద ప్రభావిత ప్రాంత వాసులను రక్షించడంలో లేదని విమర్శించారు. పువ్వాడకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని పొంగులేటి జోస్యం చెప్పారు.

2014లో బీఆర్‌ఎస్‌ (brs) అధికారంలోకి రాగానే అనేక పనులు చేస్తామని గొప్పలు చెప్పారని, రైతుల కోసం మంచి పాలన అందిస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ (kcr) మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. ఇళ్లు వరదల్లో మునిగిపోయి నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం 25 వేల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. వరదల వల్ల మృతి చెందిన వారి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతోందని మాజీ ఎంపీ స్పష్టం చేశారు.

Primary Sidebar

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ

waheeda, dada saheb award

movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

lawrence met rajini

movies:రజనీ కాళ్ళు మొక్కిన లారెన్స్ రాఘవ

aleru mla sunitha

Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

niharika in USA

Niharika:అమెరికా వీధుల్లో మెగా అమ్మాయి గ్లామర్ షో

Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ…శివాజీ ఓవర్ యాక్షన్

manipur riots

Manipur: మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి…

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online