Stock Market Today: నిన్న లాభాలతో పరుగులుతీసిన దేశీ మార్కెట్లు ఇవాళ డీలా పడిపోయాయి. ఉదయం ప్రారంభం దగ్గర నుంచే స్టాక్ మార్కెట్ సూచీలు దిగువ చూపు చూస్తున్నాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ (Sensex) 145 పాయింట్లు నష్టపోయి 73,868 దగ్గర ఉండగా..నిఫ్టీ (Nifty) 24 పాయింట్లు కుంగి 22,437 దగ్గర ట్రేదవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు…ఇక్కడ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు స్వల్ప లాబాల్లో ఉన్నప్పటికీ వాటి ప్రబావం దేవీ సూచీల మీద అంతగా కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 87.83 డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.522.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,208.42 కోట్ల స్టాక్స్ను కొనుగోలు చేశారు.
పూర్తిగా చదవండి..Stock Market News: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి.. నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి.
Translate this News: